ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం నేటితో ముగిసింది. రేపటి నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు పని చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ న్యాయవాదులు, సిబ్బందికి తెలంగాణ న్యాయవాదులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 900 మంది ఏపీ హైకోర్టు సిబ్బంది ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి హైకోర్టు ఆవరణలో తీవ్ర భావోద్వేగం నెలకొంది. రేపు ఉదయం అమరావతి నుంచి ఏపీ హైకోర్టు కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఏపీ చీఫ్ జస్టిస్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.