అమరావతి : ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం అధికారులతో మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 63.27 శాతం, కాంక్రీట్ పనులు 57.90శాతం పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.36.79 లక్షల క్యూబిక్ మీటర్లకు గానూ 21.30లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయన్నారు. తవ్వకం పనులు 83.60శాతం పూర్తయ్యాయన్నారు. మొత్తం 933.01 క్యూబిక్ మీటర్ల వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90శాతం, ఎడమ ప్రధాన కాలువ 66.77 శాతం అయ్యిందన్నారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 62.52 శాతం, కాఫర్ డ్యామ్ పనులు 6.04 శాతం పూర్తయ్యిందని చంద్రబాబు తెలిపారు.