భోపాల్ : మధ్య ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి కమల్నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 70 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకు కేటాయించే పరిశ్రమలకే ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిహార్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి చాలామంది వస్తున్నారని, దీంతో స్థానికులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారన్నారు.
దీనికోసం ఫైలు మీద సంతకం పెట్టాను అని అన్నారు. కాగా ఈ ప్రకటనపై బీజేపీ, ఆర్జేడీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మహారాష్ట్రలో ఇలాంటి డిమాండ్లను ఓ ప్రాంతీయ పార్టీ చేసినపుడు కాంగ్రెస్ వ్యతిరేకించిన విషయాన్ని వారు గుర్తుచేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ మంగళవారం పార్లమెంటు వెలుపల విలేకర్లతో మాట్లాడుతూ తనకు కమల్నాథ్ చేసిన ప్రకటన వివరాలు తనకు తెలియవని అన్నారు. ఈ ప్రతిపాదనపై కమల్నాథ్తో చర్చించాల్సివుందన్నారు.