వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని మరింత సరళతరం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సూచనప్రాయంగా తెలిపారు. 99 శాతం వస్తువులను 18 శాతం పన్ను పరిథిలోకి తేవాలని తమ ప్రభుత్వం కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించారు.
జీఎస్టీ అమలులోకి రావడానికి పూర్వం వ్యాపార సంస్థలు 65 లక్షలు మాత్రమే నమోదయ్యాయని, ఇప్పుడు మరో 55 లక్షలు పెరగడంతో, మొత్తం 1 కోటి 20 లక్షలకు చేరాయన్నారు. ప్రస్తుతం జీఎస్టీ విధానం పరిధి పెరిగిందని, సబ్-18 శాతం జీఎస్టీ శ్లాబ్ పరిథిలోకి 99 శాతం వస్తువులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొన్ని ఎంపిక చేసిన వస్తువులకు మాత్రమే 28 శాతం పన్ను శ్లాబును వర్తింపజేయనున్నట్లు మోదీ చూచాయిగా తెలిపారు. దీంతో విలాస వస్తువులను మాత్రమే 28 శాతం పన్ను పరిథిలోకి తీసుకెళ్ళే అవకాశం ఉందని తెలుస్లోంది.