గోవా: గోవాలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఆ రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ను సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలని ఆహ్వానించారు. అంతకుముందు ఆదివారం సాయంత్రం మనోహర్ పారికర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కలిశారు. 21 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు అందజేశారు.