కదిరి: అనంతరపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని కదిరి మండలం ఆంజనేయస్వామి గట్లు దగ్గర ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతి చెందిన ఇద్దరిని తల్లీకూతుళ్లు పార్వతమ్మ, సునీతగా గుర్తించారు