శబరిమల : తీవ్ర ఉద్రిక్తతల మధ్య శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తలుపులు కొద్ది సేపటి కిందట తెరిచారు. ఈ రోజు నుంచి 62 రోజుల పాటు జరిగే మండల మకరవిళక్కు మహోత్సవం జరగనున్న సందర్భంగా ఆలయం తలుపులు తెరిచారు. ఆలయ ప్రధాన పూజారి హారతి ఇవ్వడంతో ఉత్సవం ప్రారంభమైంది. అన్ని వయస్సుల మహిళలకు ఆలయ ప్రవేశానికి అనుమతి ఇవ్వాలన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయ సంప్రదాయాలను పరిరక్షించుకుంటామంటూ భక్తులు ఆందోళనలు చేయడం, ఎట్టిపరిస్థితుల్లోనూ కోర్టు తీర్పును అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించడంతో ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యలుగా శబరిమల పరిసరాలలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.