ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనంతపురం పర్యటనకు బయలుదేరారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన అనంతపురం జిల్లాకు వెళతారు. రాయదుర్గం, కళ్యాణ దుర్గంలో జరిగే పలు కార్యక్రమాలలో చంద్రబాబు పాల్గొంటారు. బైరవాని తిప్పలో ఫాపౌండ్లను ప్రారంభించి పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం బీపీటీ ప్రాజెక్టును సందర్శించి అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత కుందిర్పి కెనాల్ పనులకు చంద్రబాబు భూమిపూజ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.