కోటపాడు : తునిలో రైలును తగులబెట్టింది చంద్రబాబేనని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలోని కోటపాడుకు చేరుకుంది. ఈసందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… కాపులకు సంబంధించిన ఘటన అయితే ఎస్సీలపై కేసులు పెట్టారన్నారు. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని బాబు హామీ ఇచ్చారన్నారు. నాలుగేళ్లలో రైతుల వడ్డీల్లో నాలుగో వంతు కూడా మాఫీ చేయలేదన్నారు.