సంసారానికి తాను పనికి రాను.. ఈ విషయాన్ని బయటకు చెబితే నీ నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని భార్య బెదిరించి.. ఆమెను వేధింపులకు గురి చేశాడు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన ఐటీ ఉద్యోగి రాజేంద్రప్రసాద్కు ఓ యువతితో గతేడాది ఆగస్టులో పెళ్లి అయింది. కట్నం కింద రాజేంద్రప్రసాద్కు రూ. 45 లక్షలు ఇచ్చారు. అయితే పెళ్లి అయిన తర్వాత తొలి రాత్రి భర్త.. భార్యకు భయంకరమైన నిజం చెప్పాడు. తాను సంసారానికి పనికి రాను అని చెప్పి భర్త.. ఆ తర్వాత ఆమె నగ్న ఫోటోలు తీసుకున్నాడు. విషయం బయటకు చెబితే.. ఈ నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని ఆమెను బెదిరించాడు. దీంతో సంవత్సర కాలం పాటు ఆమెను వేధించాడు. ఇదే విషయాన్ని అత్తమామలకు చెప్పిన కూడా వినిపించుకోకుండా మానసికంగా హింసించారు. మొత్తానికి భర్త, అత్తమామల దారుణాన్ని భరించలేని ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.