చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భౌతికకాయానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. కరుణానిధి పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచిన మోదీ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కరుణానిధి భౌతికకాయానికి నివాళులర్పించారు. ప్రధాని మోదీ ఎంకే స్టాలిన్, కనిమొళితో పాటు కరుణానిధి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్పోర్టులో ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంతో పాటు పలువురు స్వాగతం పలికారు.