చెన్నై : అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిథికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాంది, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఈ ఉదయం కరుణానిథి భౌతిక కయాన్ని సందర్శించిన నివాళులర్పించారు. అలాగే టిటివి దినకరణ్, సీపీఐ నేత రాజా కూడా కరుణానిథి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సినీ నటులు అజిత్, షాలిని, సూర్య, ఖుష్బు తదితరులు కూడా కరుణానిథికి నివాళులర్పించాన వారిలో ఉన్నారు.