కృష్ణా జిల్లా నందిగామలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. డిమాండ్ల సాధన కోసం 12 రోజులుగా కార్మికులు సమ్మెకు దిగడంతో నగరంలో భారీగా చెత్తా చెదారం పేరుకుపోయింది. దీంతో ప్రైవేట్ వ్యక్తులను మున్సిపల్ అధికారులు రంగంలోకి దింపింది. విషయం తెలిసిన కార్మికులు పారిశుద్ధ్య పనులను అడ్డుకుని ఆందోళనకు దిగారు. ప్రైవేట్ వ్యక్తులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడకు చేరుకుని కార్మికులను అడ్డుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు.