వ్యక్తి మరణించిన తన భార్య శవాన్ని భుజానపెట్టుకుని నడిచిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. డెడ్ బాడీని సొంత ఊరుకు తరలించడానికి ప్రభుత్వ హస్పిటల్ వెహికిల్ కల్పించకపోవడంతో..భార్య శవంతో అతడు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనే మరోసారి రిపీట్ అయ్యింది. మరణించిన తల్లికి పోస్ట్ మార్టం చేసేందుకు 35 కిలీమీటర్లు శవాన్ని బైక్ పైనే తీసుకెళ్లాడు. హృదయ విదారక సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోస్టుమార్టం కోసం ఆస్పత్రి సిబ్బంది వాహనాన్ని నిరాకరించడంతో తన తల్లి శవాన్ని బైక్ పై తరలించాడు ఓ వ్యక్తి.
వివరాల్లోకెళితే..మధ్యప్రదేశ్ లోని మస్తాపూర్ గ్రామానికి చెందిన కున్వర్ భాయ్ అనే మహిళ గత ఆదివారం పాముకాటుకు గురైంది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ..అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టంకు తరలించాల్సిందిగా సూచించారు. పోస్టుమార్టం కోసం వాహన సదుపాయాన్ని కల్పించాల్సిందిగా కున్వర్ భాయ్ కుమారుడు రాజేశ్ ఆస్పత్రి సిబ్బందిని కోరాడు. దీనికి సిబ్బంది నిరాకరించింది. దీంతో గత్యంతరం లేక తన బైక్ పై తల్లి శవాన్ని 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్టుమార్టం సెంటర్కు తరలించాడు. ఈ ఘటనను స్థానిక ప్రజలు వీడియో తీసు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పడా వీడియో వైరల్ అయింది.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమెను సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే బతికేదన్నారు. పాముకాటుకు గురైన మహిళను మొదటగా స్థానికంగా ఉన్న దేవాలయంకు తరలించారని, అనంతరం ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు తెలిపారు. సమయం మించిపోవడంతో ఆమె చనిపోయినట్లు విచారణలో తేలింది అని తెలిపారు కలెక్టర్. హస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్