న్యూఢిల్లీ : ఢిల్లీలో అధికారంపై సుప్రీం కోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పును ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియా స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రక తీర్పుగా అభివర్ణించారు. ఇక ఢిల్లీలో పాలన స్తంభించే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఢిల్లీ సర్కార్ ఇక నుంచి ఫైళ్లను అనుమతి కోసం లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపాల్సిన అవసరం ఉండదని మనీష్ సిసోడియా అన్నారు.