అమరావతి: పేదల సొంతింటి కల నిజం చేస్తూ రేపు ఓ మైలురాయి దాటనున్నామని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ రేపు 3 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయనున్నామని పేర్కొన్నారు. హుద్హుద్ బాధితులకు 5వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని , విజయవాడ పడమర మినహా 174 నియోజకవర్గాల్లో గృహ ప్రవేశాలు జరుగనున్నాయన్నారు. గ్రామీణ గృహ నిర్మాణ శాఖ ద్వారా 13లక్షల ఇళ్లు ఇస్తామన్నారు.