ముంబై : ఆరోగ్యకరమైన జాతి కోసం పాఠశాల స్థాయిలో పాఠ్యాంశంగా యోగాను ప్రవేశపెట్టాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. బంద్రా రిక్లమేషన్ సీలింక్ ప్రొమేనేడ్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. సానుకూల ఆలోచనలకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. మారుతున్న జీవనశైలి కారణంగా కలుగుతున్న ఒత్తిళ్లనుంచి కొంత ఉపశమనం కలిగించడానికి యోగా ఉపకరిస్తుందని ఆయన అన్నారు.