అమరావతి : రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నా లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకుంటామని ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎపిలో జరిగే అభివృద్ధికి ప్రతి రూపాయీ కేంద్రానిదేనని ఆయన చెప్పారు. తిరుపతి తిరుమల దేవస్థానంలో జరిగిన అవినీతిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా అని కన్నా ప్రశ్నించారు. రాయలసీమలో నీటి కరవు ఎందుకు తీర్చలేకపోయారని, రాయలసీమపై చిత్తశుద్ధి ఉంటే హంద్రీనీవా ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు.