తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారిని దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. భక్తుల తాకిడితో క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణం, ప్రసాదం కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు, స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది. సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.