తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 189వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 189వ రోజు పాదయాత్రను పేరవరం నుంచి ప్రారంభించారు. పాదయాత్ర వెలిచేరు, వద్దిపర్రు క్రాస్, పులిదిండి, ఉచ్చిలి మీదుగా ఆత్రేయపురం వరకు కొనసాగనుంది.