అమరావతి : నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 18వ తేదీకి వాయిదా వేయాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్కు చంద్రబాబు లేఖ రాశారు. నీతి ఆయోగ్ 4వ సమావేశాన్ని నిర్వహించాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. కనీసం ఈ నెల 17 తేదీ మధ్యాహ్నానికైనా వాయిదా వేయాలని ఆయన కోరారు. ఈ నెల 16వ తేదీన రంజాన్, 17వ తేదీన ఈద్ మిలాప్ కార్యక్రమాలున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రంజాన్ ముస్లింలకు పెద్ద పండుగ అని, వారంతా పెద్ద సంఖ్యలో వస్తారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. తాను రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉండటం అవసరమని ఆయన అన్నారు.