ఢిల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకు ఒక్కసీటు వచ్చే పరిస్థితి లేదు టీడీపీ నాయకుడు సి.ఎం.రమేష్ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు వరమన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కడప ఉక్కు కర్మాగారం కోసం ఆమరణ దీక్ష చేస్తానని అన్నారు. ఈ నెల 17,18 తేదీల్లో ప్రధాని సమయం కోరానన్నారు. సమయమిస్తే ప్రతినిధి బృందంతో ప్రధానిని కలిసి కడప ఉక్కు కర్మగారంపై విజ్ఞాపన ఇస్తామన్నారు.