ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుద్దిగ ఉండాలని చెప్పినందుకు.... తల్హిదండ్రులను హ త్య మైనర్ బాలిక

national |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 08:07 PM

ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన మహ్మద్ షబ్బీర్ (47), రెహాన్ (44) దంపతులకు నలుగురు కుమార్తెలు. రెండు వారాల క్రితం భార్యభార్యలిద్దరూ దారుణంగా హత్యకు గురయ్యారు. ఇంటి ముందు మంచాల మీద నిద్రిస్తుండగా.. దుండగులు గొడ్డలితో దాడి చేసి వారిని చంపేశారు. ఈ హత్య కేసులో 16 మంది అనుమానితుల్ని విచారించిన పోలీసులు.. చివరకు వారిని హత్య చేసింది ఎనిమిదో తరగతి చదువుతున్న వారి పెద్ద కూతురేనని తేల్చారు. శిఖర్‌పూర్ ఎస్‌హెచ్‌వో ప్రేమ్ చంద్ శర్మ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.


‘మార్చి 15వ తేదీన మహ్మద్ షబ్బీర్, అతడి భార్య రెహానా ఇంటి ముందు మంచాలపై రక్తపు మరకలతో పడి ఉండటాన్ని ఇరుగుపొరుగు గమనించారు. అప్పటికే రెహానా చనిపోగా.. షబ్బీర్ ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నాడు. దీంతో వెంటనే అతణ్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అక్కడ అతడు చనిపోయాడు’ అని ఎస్‌హెచ్‌వో తెలిపారు.


‘‘షబ్బీర్ దంపతుల పెద్ద కుమార్తె 8వ తరగతి చదువుతోంది. 14వ తేదీ రాత్రి మెడికల్ షాప్‌లో పని చేసే వ్యక్తి దగ్గర ఆమె స్లీపింగ్ పిల్స్ కొనుగోలు చేసింది. మత్తు ట్యాబెట్లను టీలో కలిపి తల్లిదండ్రులకు ఇచ్చింది. దీంతో వారు నిద్రలోకి జారుకున్నారు. ఇదే అదనుగా భావించిన ఆమె గొడ్డలితో పదే పదే వారి తలలపై కొట్టింది. అనంతరం వారి శరీరాలను ఓ షీట్‌తో కప్పి ఉంచింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. ఇంటికి బయటి నుంచి తాళం వేసి.. తాళం చెవులను తండ్రి దిండు కింద పెట్టింది. పక్కింటి డాబా మీదకు ఎక్కి.. అక్కడి నుంచి తమ ఇంట్లోకి ప్రవేశించింది.


భార్యాభార్యలు హత్యకు గురయ్యారనే సమాచారం అందుకున్న పోలీసులు 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తర్వాత బాలిక ఫోన్లో ఆడియో‌ రికార్డింగ్‌ను రికవరీ చేసి విన్నాక ఆమె పట్ల అనుమానం వచ్చింది. ఏం జరిగిందని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పింది.


తనకు స్లీపింగ్ పిల్స్ కావాలని ఓ వ్యక్తి బాలిక అడగడం ఆమె ఫోన్లో రికార్డయ్యింది. దీంతో పోలీసులకు అనుమామనం వచ్చింది. విచారణ జరపగా.. అబ్బాయిలతో మాట్లాడొద్దని తనపై ఆంక్షలు పెట్టడంతో తానే తల్లిదండ్రులను హతమార్చినట్లు అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్న పోలీసులు బాలికను జువైనల్ కరక్షన్ హోంకు తరలించారు. బాలికకు పిల్స్ సరఫరా చేసిన మహ్మద్ అఖీల్ అనే 22 ఏళ్ల యువకుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.


అబ్బాయిలతో మాట్లాడొద్దని చెప్పినందుకే ఓ అమ్మాయి ఇంత విచక్షణా రహితంగా.. తల్లిదండ్రులనే పక్కా ప్లాన్‌తో కడతేర్చిందంటే.. నేటి తరం పిల్లలను ఏయే అంశాలు ప్రభావితం చేస్తున్నాయో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో.. టీనేజర్లు నేర ప్రవృత్తికి త్వరగా అలవాటు పడుతున్నారు. ఓటీటీలు, సోషల్ మీడియాలో లభ్యం అవుతోన్న కంటెంట్ చూసి హత్యలు చేసి ఎలా తప్పించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా డ్రగ్స్, గంజాయి, బ్లూ ఫిల్మ్‌లకు బానిసై.. విచక్షణ కోల్పోయి.. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పిల్లలు పూర్తి చెడిపోయారని తెలిసేంత వరకూ ఏ తల్లిదండ్రులకు తమ పిల్లల మీద అనుమానం రాదు. తమ పిల్లలు బంగారమని బలంగా నమ్ముతారు. కానీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచడం.. వారి ఫోన్, ఇంటర్నెట్ వాడకాన్ని ట్రాక్ చేయడం ఎంతో అవసరం.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com