న్యూఢిల్లి : రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి పార్లమెంటు అంగీకరించిందని కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును తాను అభినందిస్తున్నానని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు.