శ్రీకాకుళం: సీతంపేటలో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సీతంపేటలో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీడీఏలో గిరిజన యువతతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఆమదాలవలస మండలం జగ్గుశాస్త్రులపేటలో 344 ఇళ్ల నిర్మాణానికి లోకేశ్ శంకుస్థాపన చేశారు.