అమరావతి: బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని ప్రకటించినా మా కార్యకర్తలు ఆమోదిస్తారని ఏపీ బీజేపీ నేత సోమువీర్రాజు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల తర్వాత ఏదో జరగబోతుందని చంద్రబాబుకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 2019 ఎన్నికల్లో సానుభూతి పనిచేయదని చెప్పేందుకే అలిపిరి ఘటనను ప్రస్తావించానని పేర్కొన్నారు.