లండన్ : స్వీడన్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ లండన్ చేరుకున్నారు. నాలుగు రోజులపాటు ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. చోగమ్ సమావేశానికి ఆయన హాజరవుతారు. బ్రిటన్ ప్రధాని థెరెసామేతో ఆయన సమావేశమవుతారు. అలాగే బకింగ్హామ్ ప్యాలెస్లో క్వీన్ ఎలిజబెత్-2తో ప్రధాని మోడీ సమావేశమవుతారు.