న్యూఢిల్లి : కేంద్ర ప్రభుత్వం ఎస్సి,ఎస్టి చట్టం (అత్యాచారాల నివారణ) చట్టం ఆర్డినెన్స్ ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ చట్టంలో సుప్రీంకోర్టు మార్పులు చేస్తూ ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలంటూ కేంద్రం వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించినట్లయితే ఆర్డినెన్స్ను జారీ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఎస్ఎసి, ఎస్టి చట్టం (అత్యాచారాల నివారణ) చట్టం ప్రకారం ఎవరిపైన అయినా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారితో ముందుగా ప్రాథమిక విచారణ జరిపించడాన్ని తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తద్వారా చట్టం దుర్వినియోగం కాకుండా ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే దీనిపై ఎస్సి, ఎస్టి సంఘాలనుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా కేంద్రం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.