ఉత్తర్ ప్రదేశ్లో దళిత సంఘాలు బంద్ పాటించినప్పుడు హింసాకాండను ప్రేరేపించారన్న కారణంగా బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పి) ముజఫర్ నగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు కమల్ గౌతమ్ను పోలీసులు అరెస్టు చేశారు. బంద్ సమయంలో జరిగిన హింసాకాండలో బిఎస్పి జిల్లా అధ్యక్షుడి ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని సీనియర్ సూపరింటెండెంట్ ఆప్ పోలీస్ అనంత్ దేవ్ చెప్పారు. అనేకమంది కార్యకర్తలకు కమల్ గౌతమ్ మద్యం సరఫరా చేశాడని, మద్యం మత్తులో కార్యకర్తలు బలవంతంగా దుకాణాలు మూయించి, అల్లర్లకు పాల్పడ్డారని అనంత్ దేవ్ చెప్పారు. ఎస్సి, ఎస్టి చట్టంలో సుప్రీంకోర్టు సవరణలు చేయడం ద్వారా దానిని బలహీనపర్చిందని ఆరోపిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో బంద్ జరిగింది.