న్యూఢిల్లి : ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ భవన్లో వైకాపా ఎంపిలు చేపట్టిన ఆమరణ నిరశన దీక్షకు సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి సంఘీభావం ప్రకటించారు. వైకాపా లోక్సభ ఎంపిలు నిన్న తమ రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్కు సమర్పించిన తరువాత ఎపి భవన్కు వచ్చి ఆమరణ నిరశన దీక్ష చేపట్టారు.