ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ కు ఐదేళ్లు జైలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 05, 2018, 01:07 PM

జోధ్ పూర్ : కృష్ణ జింకలను వేటాడిక కేసులో నటుడు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జోధ్ పూర్ కోర్టు తీర్పు వెలువరించింది. దీనితో పాటు రూ.పదివేలు జరిమానా విధించింది. రెండేళ్లలోపు జైలు శిక్ష పడి ఉన్నట్లయితే సల్మాన్ ఖాన్ కు బెయిలు కోసం దాఖలు చేసుకునే అవకాశం ఉండేది. ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్ కుమార్ కత్రి తీర్పు ఇచ్చారు. దీంతో ఆయన ఈ తీర్పును రాజస్థాన్ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది కానీ వెంటనే బెయిలు లభించే అవకాశం లేదు. రాజస్థాన్ హైకోర్టు శిక్ష అమలుపై స్టే ఇస్తేనే ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. 1998 అక్టోబర్‌లో కంకణి వద్ద 2 కృష్ణ జింకలను హతమార్చారని కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో సల్మాన్‌ మినహా టబు, సైఫ్‌అలీఖాన్‌, సొనాలి బింద్రె, నీలం కొఠారీలను నిర్దోషులుగా పేర్కొంది. రెండు దశాబ్దాల కిందట కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ కోర్టు నటుడు సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారించింది. కాగా సల్మాన్ తరఫు న్యాయవాదులు ఆయనకు కనీస శిక్ష విధించాలని కోర్టును వేడుకున్నారు. హీరో సల్మాన్ ఖాన్ సామాజిక సేవను దృష్టిలో ఉంచుకుని కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఆయనకు కనీస శిక్ష ఖరారు చేయాల్సిందిగా న్యాయవాదులు కోర్టును కోరారు. కృష్ణ జింకలను వేటాడిక కేసులో దోషిగా నిర్ధారణ అయిన సల్మాన్ ఖాన్ బెయిలు కోసం దరఖాస్తు చేసుకోనున్నారు. శిక్ష ఖరారైనట్లు న్యాయమూర్తి తీర్పు చెప్పిన అనంతరం ఆయనను జోధ్ పూర్ జైలుకు తరలించనున్నారు. కాగా సల్మాన్ తరఫు న్యాయవాదులు బెయిలు పిటిషన్ దాఖలు చేయనున్నారు. సల్మాన్ సామాజిక సేవను దృష్టిలో ఉంచుకుని కనిష్ట శిక్ష వేయాల్సిందిగా విజ్ణప్తి చేశారు. ఇలా ఉండగా జోధ్ పూర్ కోర్టు తీర్పును పైకోర్టలోసవాల్ చేయడానికి సల్మాన్ కు నెల రోజుల గడువు ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com