జైపూర్ : రాజస్థాన్ లో అంబేడ్కర్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత అచ్రోల్ లో జరిగింది. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన రెండో ఘటన ఇది. కాగా అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం ఘటనను నిరసిస్తూ అచ్రోల్ లో ఆందోళనలు మిన్నంటాయి. ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీసులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తుల కోసం గాలింపు చర్చలు చేపట్టారు.