న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు ప్రారంభయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లో విభజన చట్టంపై చర్చించాలని టీడీపీ, ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానాలను అందజేశాయి. రాష్ర్టాలకు రిజర్వేషన్లు అంశంపై టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతుంది. ఆందోళన నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభా సమావేశాలను వాయిదా వేశారు. రాజ్యసభలో మంత్రులు సంబంధితశాఖల సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.