న్యూఢిల్లి : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడైన కార్తీ చిదంబరాన్ని సిబిఐ అధికారులు ముంబైకి తరలించారు. గతవారం సిబిఐ కార్తీ చిదంబరాన్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన విషయం విదితమే. కార్తీని ప్రశ్నించడానికి తమ కస్టడీకి ఇవ్వాలన్న సిబిఐ వినతి మేరకు కోర్టు కార్తీని సిబిఐ కస్టడీకి పంపింది. ఈ కేసులో కార్తీని ప్రశ్నించేందుకు సిబిఐ అధికారులు అతడిని ముంబైకి తీసుకువెళ్లారు. ఐఎన్ఎక్స్ మీడియాలో మాజీ భాగస్తులైన ఇంద్రాణీ ముఖర్జియా, పీటర్ ముఖర్జియాల సమక్షంలో కార్తీని ప్రశ్నించే అవకాశం ఉంది.