గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో ఏజెన్సీల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బోయ, వాల్మీకులు, మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చొద్దని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహిస్తున్నారు. ఏజెన్సీల్లో పలు చోట్ల గిరిజనులు నిరసనలు కార్యక్రమాలు, ఆందోళనలు చేస్తున్నారు. బంద్ ప్రభావంతో ఏజెన్సీల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలో దుకాణాలు మూతపడ్డాయి. బంద్లో భాగంగా అరకులోయలో పర్యాటక ప్రదేశాలు, షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఏజెన్సీల్లో బంద్ సందర్భంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.