దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లో నిర్వహణ లోపాల కారణంగా ఆదివారం నడవాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. విజయవాడ-గుంటూరు, గుంటూరు-మాచర్ల, మాచర్ల-నడికుడి, నడికుడి-మాచర్ల, మాచర్ల-విజయవాడ, డోర్నకల్-విజయవాడ, విజయవాడ-డోర్నకల్, భద్రాచలం రోడ్-విజయవాడ, విజయవాడ-భద్రచలం రోడ్ రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు శనివారం విజయవాడ రైల్వే అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.