తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న 62,424 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.96 కోట్లు. నిన్న 18,960 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.