దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు పలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించింది.