మన దేశంలో నిరుద్యోగ సమస్యపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా శనివారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారిలో కేవలం 40 శాతం మందికే పని దొరుకుతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతవరకూ చైనాపై ఆధారపడిన ప్రపంచ దేశాలు ఇప్పుడు మనవైపు చూస్తున్నాయని, ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలంటే నిరుద్యోగ సమస్యను అధిగమించాలని ఆయన సూచించారు.