మహారాష్ట్ర రాజధాని ముంబైలో టీటీడీ నూతనంగా శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనుంది. ఆలయ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 21న ఆలయానికి భూమి పూజ నిర్వహించడానికి టీటీడీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్రలోని దాదాపుగా అన్ని పార్టీలకూ టీటీడీ ఆహ్వానం పలుకుతోంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముంబైలోని పెద్దలను కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు.