టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీ అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త అర్థం చెప్పారు. దానికి అధ్యక్షుడిగా ఒక నపుంసకుడిని పెట్టారు.. వాడికి చేతగాక ఎస్సీలు, బీసీలతో తిట్టిస్తున్నాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు. ఎన్టీఆర్ రోజుల్లో టీడీపీ వారు మా పార్టీని చూడండి అంటే… ఇప్పుడు చంద్రం తాతయ్య రోజుల్లో టీడీపీ నాయకులు మాది చూడండి అంటున్నారు! థూ… వీళ్ల బతుకు చెడ.. అంటూ విమర్శలు గుప్పించారు. పిచ్చి కుక్క కరిచిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపిస్తాం.. అదే టీడీపీలో అయితే చంద్రబాబు అనే పిచ్చి కుక్క కరిచిన వారిని అధికార ప్రతినిధులుగా పంపిస్తారు అంటూ ఘాటు కామెంట్లు పెట్టారు. ఇక, రేప్ చేస్తా అంటూ పేలుతున్న అశుద్ధం గంజాయి పాత్రుడి వంటి టీడీపి వెధవలను పశువుల హాస్పిటల్ ఆవరణలో ఉండే ఇనుప చట్రంలో కట్టేసి… పశువులకు ఇచ్చే ట్రీట్మెంటే ఇవ్వాలి.. అంటూ అయ్యన్నపాత్రుడిని ఉద్దేశిస్తూ మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. మంత్రిగా పని చేసిన పనికిమాలిన తెలివి తక్కువ కొడుకు కాకుండా, దత్తపుత్రుడే మెరుగని తండ్రి అనుకున్న తరువాత... చీమూ, నెత్తురూ ఉన్న ఎవడైనా అదే పార్టీలో అలాగే కొనసాగగలడా? తెలుగు బూతు పార్టీలో జ్ఞానంలేని పిల్ల భూతంగాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఏ ఒక్క సబ్జెక్ట్ అయినా రాసి పాస్ కాగలడా? నారాయణ కాలేజీలో అయినా సరే! అంటూ తాజాగా చేసిన ట్వీట్లో విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.