ట్రెండింగ్
Epaper    English    தமிழ்

4వ తేదీ పదో తరగతి ఫలితాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 02:34 PM

పదో తరగతి పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ విడుదల చేస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారన్నారు. గతంలో మాదిరే ఈసారీ విద్యార్థులకు వచ్చిన మార్కులనే వెల్లడిస్తారని, గ్రేడింగ్‌ పద్ధతిని తీసేశారన్నారు. విద్యాశాఖ ర్యాంకులనూ ప్రకటించదని, ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు కూడా తమ దగ్గర చదువుకున్న విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేయకూడదన్నారు. అలా చేస్తే కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని విద్యాశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com