ఐపీఎల్-2022లో క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈమ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈమ్యాచ్ లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్మెన్లలో రజత్ పాటిదార్ 58, డుప్లెసిస్ 25, మ్యాక్స్వెల్ 24 పరుగులు చేశారు. కీలక మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 7, దినేష్ కార్తీక్ 6 పెవిలియన్ చేరారు. రాజస్థాన్ బౌలర్లలో ప్రసీద్ కృష్ణ 3, మెక్ కాయ్ 3, బౌల్ట్ 1, అశ్విన్ 1 వికెట్లు తీశారు.