పలాస మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అకౌంటెంట్ అధికారి ఏ.జానకిరావు రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఫిబ్రవరి 2021 సం"లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎలక్షన్ బూతుల్లో పనిచేసిన కాంట్రాక్టర్లకు రూ. 3.71 లక్షల పెండింగ్ బిల్లును మంజూరు చేసేందుకు గుత్తేదారులు రవికుమార్ నుంచి రూ. 15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు.