మహిళల విభాగంలో టీ20 మ్యాచ్లో భాగంగా ట్రయల్ బ్లేజర్స్తో సూపర్నోవాస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈమ్యాచ్ లో సూపర్నోవాస్ విజయం సాధించింది. సూపర్ నోవాస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. 164 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన 34 పరుగులు , జెమీమా రోడ్రిగ్స్ 24 చేసారు. పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లు తీయగా, సోఫీ, అలన్ కింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. మేఘనా సింగ్కు ఒక వికెట్ దక్కింది.