ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షుద్రపూజలు చేస్తున్నాడని తల నరికి.. తలతో ఊరంతా తిరిగాడు

national |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 09:09 PM

క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడు తన మేనమామను దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో నరికి తల, మొండాన్ని వేరు చేశాడు. ఆ తర్వాత తలను చేతిలో పట్టుకొని ఊరంతా తిరిగాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్​ రాష్ట్రం సీధీ జిల్లాలోని కరి మాటి గ్రామంలో జరిగింది. నిందితుడిని రవీంద్ర సింగ్ గౌర్​(26)గా గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొన్నేళ్ల క్రితం రవీంద్ర సింగ్ తండ్రి చనిపోయాడు. అయితే తన తండ్రి చావుకు మేనమామ మక్సుదన్ సింగ్ గౌర్ (60) కారణమంటూ రవీంద్ర ఆరోపించేవాడు. అతడు క్షుద్రపూజలు చేయడం వల్లే తన తండ్రి చనిపోయాడని చెప్పేవాడు. ఈ క్రమంలోనే మక్సుదన్ ​పై ప్రతీకారం తీర్చుకుంటానని గతంలోనే చెప్పాడు. ఇప్పుడు ఏకంగా చంపేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com