జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో ప్రయాణీకుల బస్సులో మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు మరణించారు మరియు 20 మంది గాయపడ్డారు. గాయపడిన ప్రయాణికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మంటలు చెలరేగడానికి గల కారణాలను ఫోరెన్సిక్ బృందం నిర్ధారిస్తోంది. ప్రాథమిక విచారణలో బస్సు వేడెక్కడం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని తెలిపారు.బస్సు కత్రా నుంచి జమ్మూ వైపు వెళ్తుండగా నోమై సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.