ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలం అప్పన్నకు హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 10:18 PM

సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి భక్తుడు భారీ విరాళాన్ని సమర్పించారు. సింహాచలం అప్పన్న నిత్య అన్నప్రసాద పథకానికి ఒకే కుటుంబానికి చెందిన పలువురు భక్తులు కలిసి రూ.5లక్షలు విరాళాలుగా అందజేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌కు చెందిన బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రసాద్.. రాజమహేంద్రవరం వాకర్స్‌ రోడ్డుకు చెందిన బూరుగుపల్లి తిమ్మరాజు, బూరుగుపల్లి నితీశ్‌ కృష్ణ, బూరుగుపల్లి వెంకట తిమ్మరాజు రూ.1.25 లక్షల చొప్పున మొత్తం రూ.5లక్షలు విరాళాలు అందజేశారు.


ఈ విరాళం డబ్బుల్ని సింహాచలం ఆలయంలోని కౌంటర్‌లో పర్యవేక్షకుడు సిరిపురపు కనకరాజుకు అందజేశారు. ఈ మేరకు దాతలకు అధికారులు స్వామివారి దర్శనం కల్పించారు. సింహాచలం అప్పన్న ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.. ఏఈవో ఆనంద్‌కుమార్‌ స్వామివారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు. సింహాచలం అప్పన్న నిత్య అన్నప్రసాద పథకానికి భక్తులు విరాళాలు అందజేస్తుంటారు.


మరోవైపు సింహాచలం అప్పన్న స్వామి భక్తులకు బంగారు శాంత నృసింహ కవచం అలంకరణలో దర్శనమిచ్చారు. సింహాచలం ఆలయంలో ప్రతి గురువారం సింహాద్రినాథుడు స్వర్ణ కవచం అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే మే నెలలో జరిగిన చందనోత్సవం.. ఆ తర్వాత చందన సమర్పణలతో నాలుగు నెలల పాటు స్వర్ణ కవచం అలంకరణ జరగలేదు. అందుకే కరాళ చందన సమర్పణ అనంతరం సంపూర్ణ నిత్యరూపంలో పూజలు అందకుంటున్నారు. నాలుగు నెలల తర్వాత గురువారం నుంచి స్వర్ణ కవచం అలంకరణ ప్రారంభించగా.. బంగారు కాంతుల్లో దేవ దేవుడిని భక్తులు దర్శించుకున్నారు.


ఇటు ఓల్డ్ సిటీ బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారు భక్తులకు స్వర్ణాభరణ అలంకరణలో దర్శనం ఇచ్చారు. ప్రతీ గురువారం అమ్మవారికి త్రికాల సమయంలో విశేష పంచామృతాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. అనంతరం అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. గురువారం భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.


విశాఖలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కనిపించింది.. వేడి వాతావరణంతో జనాలు అల్లాడిపోయారు. సాయంత్రం మేఘాలు కమ్ముకుని మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. అత్యధికంగా రాత్రి 8 గంటల వరకు గంభీరంలో 60.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. అంతేకాదు మధురవాడ పరిసర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ వానకు లోతట్టు ప్రదేశాలు జలమయమయ్యాయి. మధురవాడ ఫ్లై ఓవర్ రెండు వైపులా సేవా మార్గాలు చెరువుల్లా మారిపోయాయి. ఈ వర్ష ప్రభావంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులుకలిగాయి. వర్షపు నీరు కాలువల్లోకి వెళ్లేందుకు సరైన మార్గం లేదని స్థానికులు చెబతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com