ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళం జ్ఞాపకాలను నెమరువేసుకున్న లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 09:09 PM

రాష్ట్ర రాజకీయాల్లో సంచలన ఘట్టాలను నమోదు చేసిన చారిత్రాత్మక యువగళం నాటి అనుభవాలను యువనేత నారా లోకేశ్ మర్చిపోలేదు. మంత్రిగా చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన లోకేశ్ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. బంగారు పాళ్యం పర్యటన ముగించుకొని తిరిగి రేణిగుంట ఎయిర్ పోర్టుకు వెళుతున్నప్పుడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. యువగళం పాదయాత్ర సాగే సమయంలో గాదంకి టోల్ గేట్ వద్దకు చేరుకున్నప్పుడు లోకేశ్ అక్కడ ఆగి టీ తాగారు. శుక్రవారం నాడు కాన్వాయ్ గాదంకి టోల్ గేట్ వద్దకు చేరుకున్నప్పుడు ఈ విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని... మంత్రి లోకేశ్ కు గుర్తుచేశారు. వెంటనే కాన్వాయ్ ని ఆపిన మంత్రి లోకేశ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేశ్ కు చెందిన మురుగన్ టీ స్టాల్ లోకి వెళ్లారు. కార్యకర్తలతో కలిసి చాయ్ తాగి యువగళం నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు.  అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కుశల ప్రశ్నలు వేశారు. బిజీ షెడ్యూల్లో సైతం దాదాపు అర్థగంట పాటు అక్కడి కార్యకర్తల కోసం కేటాయించడంతో వారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com