ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరూ చూస్తుండగా యువతి గొంతు కోసి దారుణం

national |  Suryaa Desk  | Published : Sat, Sep 25, 2021, 12:45 PM

అది చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌. నిత్యం అక్కడకి వందలాది ప్రయాణికులు వస్తుంటారు. దానికి దగ్గర్లోని బీజీ రోడ్డు ఉంది. ఓ రోజు మధ్యాహ్నం ఇద్దరు 25 ఏళ్ల యువతి, 20 ఏళ్ల యువకుడు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. స్టేషన్ కు వచ్చిన వారంతా చూస్తుండగానే అతడు ఆమెను కత్తితీసుకొని గొంతులో పొడిచేశాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్యాయత్నం చేస్తుండగా.. అప్రమత్తమైన అక్కడకు వచ్చిన ప్రయాణికులు అతడి ప్రయత్నాన్ని ఆపారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. బాధిత మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తాంబరం రైల్వే స్టేషన్‌ దగ్గర్లోని బీజీ రోడ్డు వద్ద ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటూ.. నడుచుకుంటూ వెళ్తున్నారు. అందులో 25 ఏళ్ల యువకుడి పేరు రామచంద్రన్. ఇతడు తమిళనాడులోని నాగపట్టణం జిల్లా తిరుక్కువలైకు చెందిన వాడు. అతడు చెన్నైలోన చెంగల్ పట్టులోని ఓ కార్ల తయారీ సంస్థలో పని చేస్తున్నాడు. 20 ఏళ్ల యువతి పేరు శ్వేత. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ , స్కూల్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో నివాసం ఉంటుంది. వీరిద్దరికి మూడేళ్ల క్రితం నుంచే పరిచయం ఉంది. ఓ రోజు ఆ యువతికి రామచంద్రన్ ఫోన్ చేసి తాంబర్ రైల్వే స్టేషన్ దగ్గరకు పిలిచాడు.


అక్కడికి వచ్చి అతడితో ఆమె మాట్లాడింది. వారిద్దరూ తాంబరంలోని రైల్వే క్వార్టర్స్ దగ్గర సంభాషిస్తూ వాకింగ్ చేస్తూ కనిపించారు. అక్కడ ఉన్న వారంతా వాళ్లు ప్రేమికులేమో అనుకున్నారు. కొద్దిసేపటికి వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ప్రయాణికులు చూస్తుండగానే.. వాదన మరింత పెరిగింది. తర్వాత రామచంద్రన్ తన జేబులో ఉన్న కత్తి తీసి యువతి గొంతులోకి దింపాడు. తర్వాత రామచంద్రన్ తన గొంతును కోసుకునేందుకు ప్రయత్నించగా.. ప్రయాణికులు అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శ్వేతను క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రామచంద్రన్ ఆత్మహత్యాయత్నం సమయంలో గాయాలైన కారణంగా.. అతడిని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అక్కడే అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సెలయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com